News

కేసులు వేసి అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారు


ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైకాపా అధినేత జగన్‌ కావాలనే పట్టిసీమ నుంచి నీళ్లు రాలేదంటున్నారని పోలవరం, అమరావతిపై కేసులు వేసి అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలవరం తామే మొదలుపెట్టామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు పోలవరం ప్రాజెక్టు డిజైన్లు కూడా అప్రూవ్‌ చేయలేకపోయారని విమర్శించారు. 5వేల కోట్లు ఖర్చుపెట్టిన కాంగ్రెస్‌ నేతలు మట్టిపనులు చేసి కోట్లు దండుకున్నారన్నారు. సీడబ్ల్యూసీ నియమాలకు అనుగుణంగా కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తిచేస్తామని వెల్లడించారు.